శ్రీవారిని దర్శించుకోలేకపోయా: నాగార్జున

ABN , First Publish Date - 2022-01-21T15:12:36+05:30 IST

కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా శ్రీవారిని దర్శించుకోలేకపోయానని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. తాజాగా నాగార్జున అమలతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకోలేకపోయా: నాగార్జున

కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా శ్రీవారిని దర్శించుకోలేకపోయానని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. తాజాగా నాగార్జున అమలతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. "కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా శ్రీవారిని దర్శించుకోలేక పోయాను. నేడు స్వామి వారిని దర్శించుకున్నాను. ఈ సంవత్సరం అందరకి బాగుండాలని...ప్రపంచం అంతా బాగుండాలి".. అని నాగార్జున అన్నారు. 


కాగా, ఇటీవల తనయుడు నాగ చైతన్యతో కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా, జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబడుతూ దూసుకుపోతోంది. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు.

Updated Date - 2022-01-21T15:12:36+05:30 IST