షాకింగ్ న్యూస్: విక్కీ కౌశల్, Katrina Kaif పెళ్లిపై వివాదం.. కాబోయే దంపతులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-07T16:27:13+05:30 IST

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నా విషయం తెలిసిందే. దీనిపై వారిద్దరూ నోరు మెదపకపోయినా.. వీరి రాయల్ వెడ్డింగ్ గురించి రోజుకో వార్త బయటికొస్తోంది.

షాకింగ్ న్యూస్: విక్కీ కౌశల్, Katrina Kaif పెళ్లిపై వివాదం.. కాబోయే దంపతులపై కేసు నమోదు

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నా విషయం తెలిసిందే. దీనిపై వారిద్దరూ నోరు మెదపకపోయినా.. వీరి రాయల్ వెడ్డింగ్ గురించి రోజుకో వార్త బయటికొస్తోంది. అయితే ఇప్పటి వరకు అంత సవ్యంగానే జరుగుతున్నట్లు కనిపించిన ఈ తరుణంలో ఈ కపుల్‌పై కేసు నమోదైంది.


విక్కీ, కత్రినా పెళ్లి చేసుకునే కోట దగ్గరలోనే ఎంతో ఫేమస్ చౌత్ మాత మందిర్ ఉంది. ఆ గుడికి ప్రతి రోజు కొన్ని వేలమంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. అయితే ఈ కపుల్ పెళ్లి కారణంగా ఆ మందిరానికి వెళ్లే దారిని పూర్తిగా మూసివేశారంటా ఈవెంట్ నిర్వహకులు. దీంతో ఆ మార్గాన్ని తెరిచి ఉంచేలా చూడాలని ఈ కాబోయే దంపతులపై కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కాగా, ఇంతకుముందే జిల్లా కలెక్టర్ రాజేంద్ర కిషన్, పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ సింగ్, ADM సూరజ్ సింగ్ నేగి, ఈవెంట్ కంపెనీ ప్రతినిధుల మధ్య.. విక్కీ, కత్రినా హై-ప్రొఫైల్ వివాహానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై చర్చలు జరిగనట్లు సమాచారం.





Updated Date - 2021-12-07T16:27:13+05:30 IST