త్వరలోనే ఆమె గురించి వెల్లడిస్తా: 30 ఇయర్స్ పృథ్వీ చెప్పిన ‘ఒకామె’ పేరు ఇదే!
ABN , First Publish Date - 2022-06-29T03:59:37+05:30 IST
తనపై కేసులకి, అలాగే ఎనిమిదేళ్ళ నుంచీ ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉండటానికి కారణమైన లేడీ పేరును.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రివీల్ చేశారు. తాజాగా ఆయన ABN ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమయ్యే ‘Open Heart with RK’ కార్యక్రమంలో
తనపై కేసులకి, అలాగే ఎనిమిదేళ్ళ నుంచీ ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉండటానికి కారణమైన లేడీ పేరును.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రివీల్ చేశారు. తాజాగా ఆయన ABN ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమయ్యే ‘Open Heart with RK’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి, వ్యక్తిగత, రాజకీయ విషయాలకు సంబంధించి అనేక విషయాలను ఆయన చెప్పుకొచ్చారు. తన లైఫ్ సక్రమంగా సాగకపోవడానికి కారణంగా చెప్పుకునే మహిళ పేరును.. మొట్టమొదటి సారి ఆయన ఈ కార్యక్రమంలో రివీల్ చేశారు.
ఈ కార్యక్రమంలో పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్లో ఒకామె... నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డబ్బు ఇచ్చేవారు. ఆమె ఇరవయ్యేళ్ళుగా నన్ను తన బిడ్డలతో సమానంగా ఆదరిస్తున్నారు. నేను బతికి ఉన్నానంటే కారణం ఆమే. కొవిడ్ సమయంలో కూడా నా దగ్గరున్నారు. అప్పుడు ఎన్నో పుకార్లు వచ్చాయి. దీనంతటికీ 2023లో సమాధానమిస్తానని చెప్పాను. త్వరలోనే ఆమె గురించి వెల్లడిస్తాను.
(సందర్భం వచ్చింది కాబట్టి... పేరు ఇప్పుడే చెప్పొచ్చుగా? అని ఆర్కే అడుగగా..)
దాసరి పద్మరేఖ. వరంగల్ నుంచి చెన్నైకి మైగ్రేట్ అయ్యారు. నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచీ తెలుసు. సినిమా రంగంలో డ్యాన్సర్గా చేశారు. తరువాత హైదరాబాద్ వచ్చేశారు. వాళ్ళ తాతగారు నాకు బాగా తెలుసు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను వెళ్ళాను. నాకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు సాయం చేస్తారు. లొకేషన్కు భోజనం కూడా పంపిస్తారు. ప్రస్తుతం నా పక్కన ఉన్నది దాసరి పద్మరేఖగారు. నా ఆలనా పాలనా ఆవిడే చూసుకుంటారు.
(మరి మీ ఇంట్లో గొడవలు రాలేదా? అని ఆర్కే అడుగగా..)
జరిగేయి. చాలా కేసులు పెట్టారు. నేను దాదాపు ఎనిమిదేళ్ళ నుంచీ ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉన్నాను.
(ఈవిడ కారణంగానేనా? అని ఆర్కే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..)
ఈవిడ కారణం కావచ్చు లేదా ఇతరత్రా వాళ్ళని ప్రభావితం చేసినవాళ్ళు కావచ్చు. నా పిల్లల్ని బాగా చూశాను. వాళ్ళు సెటిల్ అయిపోయారు. నా భార్య విజయవాడలో ఉంటుంది. గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కోర్టులో ఉన్నాయి. మా అబ్బాయి అర్థం చేసుకున్నాడు. నేను ఇప్పుడు సెపరేట్గానే ఉంటున్నాను..’’ అని పృథ్వీ చెప్పుకొచ్చారు.