చిరంజీవికి కేసీఆర్‌ పరామర్శ

ABN , First Publish Date - 2022-01-28T05:02:01+05:30 IST

ప్రముఖ నటుడు చిరంజీవి కొవిడ్‌ బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిరు స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తాను కొవిడ్‌ బారీన పడ్డానని, ఇటీవల....

చిరంజీవికి కేసీఆర్‌ పరామర్శ

ప్రముఖ నటుడు చిరంజీవి కొవిడ్‌ బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిరు స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తాను కొవిడ్‌ బారీన పడ్డానని, ఇటీవల తనని కలిసిన వాళ్లంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దాంతో చిరు త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ, రాజకీయ దిగ్గజాలు ట్వీట్లు చేస్తున్నారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిరుకి స్వయంగా ఫోన్‌ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నట్టు సమాచారం.  ‘మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ ఆకాంక్షించినట్టు తెలుస్తోంది. చిరంజీవి కుటుంబానికీ, కేసీఆర్‌ కుటుంబానికి సత్సంబంధాలున్నాయి. రామ్‌చరణ్‌ - కేటీఆర్‌ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2022-01-28T05:02:01+05:30 IST