Manchu vishnu: చిరంజీవి ఓటు నాకే!
ABN , First Publish Date - 2021-09-26T21:55:58+05:30 IST
‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరవిషయాలు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకే వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన ఆయన ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. విష్ణు మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ నేను చిరంజీవిగారిని కలవలేదు. నామినేషన్ వేసిన తర్వాత మేనిఫెస్టోను వెల్లడించి ఆయన్ను కలుస్తాను.
వారి కన్నా నేనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలను
ఆ నమ్మకంతోనే బరిలో దిగా..
నామినేషన్ తర్వాత చిరుని కలుస్తా..
నటీనటులకు అండగా ఉంటా
అప్పు చేసైనా భవనం పూర్తిచేస్తా
- మంచు విష్ణు
‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరవిషయాలు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకే వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన ఆయన ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. విష్ణు మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ నేను చిరంజీవిగారిని కలవలేదు. నామినేషన్ వేసిన తర్వాత మేనిఫెస్టోను వెల్లడించి ఆయన్ను కలుస్తాను. నా విజన్ విన్నాక తప్పకుండా నాకు ఓటు వేస్తారనుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. లోతుగా చూస్తే చాలా సమస్యలే ఉన్నాయి. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భవనానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తా. అప్పు తీసుకుని అయినా దాన్ని పూర్తి చేస్తాను. నూతన నటీనటులు పరిశ్రమలోకి వచ్చేలా చూస్తాను. సినీ నటులకు అన్ని రకాల అండగా ఉంటా. వారి పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తా. అధ్యక్షుడిగా చేయాల్సిన కార్యక్రమాల విషయంలో చాలా స్పష్టతతో ఉన్నా. ప్రకాశ్రాజ్ కంటే నేనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలను. ఆ నమ్మకంలోనే పోటీలోకి దిగాను. ఇప్పటివరకూ మా నాన్న 800 మంది ఆర్టిస్ట్లకు ఫోన్ చేసి.. మీ సహకారం కావాలి అని కోరగా వాళ్లందరూ బాగా స్పందించారు. అసలు మొదట నాన్న ఈ విషచచయంలో జోక్యం చేసుకోలేదు. ఎవరో ఒకరు ఆయనకు ఫోన్ చేసి విష్ణుని ఎన్నికల నుంచి తప్పుకోమనండి’ అని నాన్నను అడిగారు. అప్పటి నుంచి నాన్న ‘మా’ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు’’ అని విష్ణు అన్నారు.