ఓటీటీలపై మెగాస్టార్ కి ఆసక్తి లేదా?

ABN , First Publish Date - 2021-10-20T15:52:50+05:30 IST

ప్రస్తుతం పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు.. సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్స్ పై ద‌ృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ, రానాలతో పాటు.. ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా మరో స్టార్ హీరో కూడా వచ్చి చేరారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మీద ఆసక్తి లేదంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఓటీటీలపై మెగాస్టార్ కి ఆసక్తి లేదా?

ప్రస్తుతం పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు.. సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్స్ పై ద‌ృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ, రానాలతో పాటు.. ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా మరో స్టార్ హీరో కూడా వచ్చి చేరారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మీద ఆసక్తి లేదంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ‘ఆచార్య’ విడుదలకు రెడీ అవుతుండగా.. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ప్రారంభమైంది. అలాగే.. ‘భోళాశంకర్’ మూవీ సైతం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా సైతం షూటింగ్ మొదలు పెట్టబోతోంది. 



ఇంత బిజీగా ఉన్న కారణంగా చిరంజీవి ఇప్పట్లో ఓటీటీల మీద ఆసక్తి చూపడం లేదని టాక్. నిజానికి చిరు.. ఆహాలో ఓ టాక్ షోను ప్రారంభించాలి. ఆయనకి ఇంట్రెస్ట్ లేని కారణంగానే అరవింద్.. మరో స్టార్ హీరోని హోస్ట్ గా ఆ షో ను ప్రారంభించబోతున్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ కు వెళ్ళబోతోంది. ఒకవేళ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ ఈ పాటికి విడుదలై ఉండి ఉంటే.. ఆయనకి కాస్తంత తీరిక దొరికేదేమో.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోవడంవల్ల.. బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ అవడానికి ఇంత టైమ్ పట్టింది. మరి ఫ్యూచర్ లో అయినా.. చిరు ఓటీటీల వైపు దృష్టి సారిస్తారేమో చూడాలి.   

Updated Date - 2021-10-20T15:52:50+05:30 IST