ఎక్స్క్లూజివ్: చిరు ‘లూసిఫర్’ రీమేక్ తాజా అప్డేట్
ABN , First Publish Date - 2021-07-29T02:55:18+05:30 IST
‘ఆచార్య’ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న చిత్రం ‘లూసిఫర్’ రీమేక్. మోహన్రాజా దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా ఇబ్బందులు రాకుండా ఉంటే.. ఇప్పటికే
‘ఆచార్య’ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న చిత్రం ‘లూసిఫర్’ రీమేక్. మోహన్రాజా దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా ఇబ్బందులు రాకుండా ఉంటే.. ఇప్పటికే ఈ చిత్రం కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తయి ఉండేది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్పైకి వెళ్లలేదు. ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం ఓ కొలిక్కి రావడంతో చిరంజీవి ఈ ‘లూసిఫర్’ రీమేక్పై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుంచి మొదలవ్వబోతుందనేది ఎక్స్క్లూజివ్ సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్విఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై రూపొందనున్న ఈ చిత్రం ఆగస్ట్ 13 నుంచి సెట్స్పైకి వెళ్లడమే కాకుండా నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనే ప్లాన్తో టీమ్ ఉన్నట్లుగా తెలిసింది. అన్నీ కలిసొస్తే.. డిసెంబర్ నాటికి ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి భారీ సెట్స్ వేస్తున్నట్లుగా ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.