మెగాస్టార్ వదిలిన సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్

ABN , First Publish Date - 2021-09-22T16:15:33+05:30 IST

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన

మెగాస్టార్ వదిలిన సాయిధరమ్ తేజ్  ‘రిపబ్లిక్’ ట్రైలర్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో దేవాకట్టా బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.. ట్రైలర్ ను విడుదల చేసిన చిరు..  ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. 'రిపబ్లిక్' చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష’ అంటూ..  ట్వీట్ కూడా చేశారు. 


‘యాజ్ పెర్ కాన్సిటిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే .. ఉద్యోగస్తులు పనిచేయాలనే విషయం మరిచిపోయినట్టున్నావ్’ అని రమ్యకృష్ణ అంటే.. ‘యాజ్ పెర్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశం మారణహోమానికి దారితీస్తే .. ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటోళ్ళు హిట్లర్లవుతారు’ అని సాయిధరమ్ కౌంటర్ ఇవ్వడం ఇందులో ప్రధాన హైలైట్. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్ అయ్యర్ .. ‘గుణని టచ్ చేస్తే విశాఖ వాణి గారిమీద డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసినట్టే’ అని ఎవరికో వార్నింగివ్వడం కనిపిస్తుంది. చూస్తుంటే.. రమ్యకృష్ణ  ఇందులో చాలా పవర్ ఫుల్ పొలిటీషియన్ గా నటించిందని అర్ధమవుతుంది. ‘మీ భయం , అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగుకాళ్ళు’ అంటూ  సాయిధరమ్ తేజ్ పాత్ర ప్రజల్ని మోటివేట్  చేసి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించడాన్ని బట్టి చూస్తే.. రమ్యకృష్ణ పాత్రపై సాయిధరమ్ తేజ్ పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం అని చెప్పొచ్చు. 






Updated Date - 2021-09-22T16:15:33+05:30 IST