Chiranjeevi: చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడా?

ABN , First Publish Date - 2021-07-25T22:11:07+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి త‌దుప‌రి చేయ‌బోయే త‌న చిత్రాల్లో ఓ సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఏ సినిమా.. ద‌ర్శ‌కుడెవ‌రు? అనే వివ‌రాల్లోకెళ్తే...

Chiranjeevi: చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి త‌దుప‌రి చేయ‌బోయే త‌న చిత్రాల్లో ఓ సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఏ సినిమా.. ద‌ర్శ‌కుడెవ‌రు?  అనే వివ‌రాల్లోకెళ్తే, చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా రూపొంద‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ట‌.. అది కూడా తండ్రీ కొడుకులుగా. రీసెంట్‌గానే డైరెక్ట‌ర్ బాబీ.. చిరంజీవిని క‌లిసి స్క్రిప్ట్ నెరేట్ చేశార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్న మెగాస్టార్‌, త‌దుప‌రి మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో ‘లూసిఫ‌ర్’ రీమేక్‌లో న‌టిస్తారు. అది పూర్తి కాగానే బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ని టాక్‌. 

Updated Date - 2021-07-25T22:11:07+05:30 IST