ఇళయ రాజాకు మొదటి, ఏకైక శిష్యుడు.. ఈ యంగ్ మ్యుజిషియన్..

ABN , First Publish Date - 2022-01-24T23:58:39+05:30 IST

చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం అనే యంగ్ మ్యుజిషియన్ ఇసైజ్ఞాని ఇళయ రాజాకు శిష్యుడిగా చేరాడు

ఇళయ రాజాకు మొదటి, ఏకైక శిష్యుడు.. ఈ యంగ్ మ్యుజిషియన్..

చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం అనే యంగ్ మ్యుజిషియన్ ఇసైజ్ఞాని ఇళయ రాజాకు శిష్యుడిగా చేరాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో అతడు ఒక మెసేజ్‌ను జనవరి 24న పోస్ట్ చేశాడు. లిడియన్ 2019లో సీబీఎస్ టాలెంట్ షో వరల్డ్స్ బెస్ట్ విజేతగా నిలిచాడు. మిలియన్ డాలర్లను ప్రైజ్‌మనీగా గెలుచుకున్నాడు. అతడికి డ్రమ్స్, తబల, గిటార్, పియానో వంటి 14 సంగీత వాయిద్యాలను ప్లే చేయడంలో నైపుణ్యం ఉంది. 


మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా తనను శిష్యుడిగా చేర్చుకోవడంతో లిడియన్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబవుతూ ట్విట్టర్‌లో ఒక మెసేజ్ ను పోస్ట్ చేశాడు. ‘‘నన్ను ఇసైజ్ఞాని ఇళయ రాజా అంకుల్ మొదటి, ఏకైక శిష్యుడిగా చేర్చుకున్నారు. ఆయన ప్రేమను పంచుతూ నాకు ప్రతిరోజూ సంగీతం నేర్పించబోతున్నారు. మీరందరు ఆశీర్వచనాలు అందించాలి. థ్యాంక్ యూ ఆల్ ’’ అని లిడియన్ నాదస్వరం తెలిపాడు.





Updated Date - 2022-01-24T23:58:39+05:30 IST