చరణ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రాంఛైజీ..?

ABN , First Publish Date - 2021-11-27T15:14:08+05:30 IST

మెగా పవర్ స్టార్ చరణ్ - ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రాంఛైజీకి సన్నాహాలు మొదలయ్యాయని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’

చరణ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రాంఛైజీ..?

మెగా పవర్ స్టార్ చరణ్ - ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రాంఛైజీకి సన్నాహాలు మొదలయ్యాయని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ తర్వాత ప్రశాంత్ నీల్‌కు పాన్ ఇండియన్ రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమా మేకింగ్ పరంగా గొప్ప ప్రశంసలు అందుకున్న ఆయన కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే మరో పాన్ ఇండియన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించబోతున్నాడు. ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోను ఓ ప్రాజెక్ట్‌కు చర్చలు మొదలయ్యాయని సమాచారం. 


ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిరించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చరణ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ ‘కేజీఎఫ్’ మూవీ తరహాలో ప్రాంఛైజీ అని తెలుస్తోంది. అంటే, ఇది రెండు భాగాలుగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుందట. ఇక చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత.   


Updated Date - 2021-11-27T15:14:08+05:30 IST