బుచ్చిబాబుకు లైన్ క్లియర్ అయిందట!

ABN , First Publish Date - 2022-01-25T16:55:10+05:30 IST

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో సంచలనం రేపాడు దర్శకుడు బుచ్చిబాబు సాన. హీరో వైష్ణవ్ తేజ్, కథానాయిక కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే దర్శకుడి రెండో సినిమా మాత్రం ఇంకా మొదలే కాలేదు. యన్టీఆర్‌కు ఓ అదిరిపోయే కథ చెప్పి ఆయన్ను ఇంప్రెస్ చేశాడు. అయినప్పటికీ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు తక్కువ. కారణమేంటంటే.. యన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రాన్ని కొరటాల దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అవడానికి చాలా టైమ్ పడుతుంది.

బుచ్చిబాబుకు లైన్ క్లియర్ అయిందట!

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో సంచలనం రేపాడు దర్శకుడు బుచ్చిబాబు సాన. హీరో వైష్ణవ్ తేజ్, కథానాయిక కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే దర్శకుడి రెండో సినిమా మాత్రం ఇంకా మొదలే కాలేదు. యన్టీఆర్‌కు ఓ అదిరిపోయే కథ చెప్పి ఆయన్ను ఇంప్రెస్ చేశాడు. అయినప్పటికీ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు తక్కువ. కారణమేంటంటే.. యన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రాన్ని కొరటాల దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అవడానికి చాలా టైమ్ పడుతుంది. ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీ లైన్ లోకి వచ్చాడు. ఆ తర్వాతే బుచ్చిబాబు సినిమా ఉంటుంది.


అయితే ఇప్పుడు అట్లీ సినిమా వెనక్కి వెళ్ళిపోయిందని తెలుస్తోంది. యన్టీఆర్ తో పాటు బన్నీకి కూడా అట్లీ కథ వినిపించాడు. ఇద్దరిలో ఎవరు ముందుగా సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తారో వారితోనే సినిమా తెరకెక్కిద్దామని అట్లీ ఫిక్సయిపోయాడు. ఈ క్రమంలో అట్లీతో సినిమా చేయడానికి బన్నీ ముందుకొచ్చాడట. దాంతో అట్లీ త్వరలో బన్నీ సినిమాని అనౌన్స్ చేయబోతున్నాడట.  యన్టీఆర్.. కొరటాల సినిమా తర్వాత బుచ్చిబాబుతోనే చేయబోతున్నట్టు సమాచారం. యన్టీఆర్ హీరోగా స్పోర్ట్స్ స్టోరీని రాసుకున్నాడట బుచ్చిబాబు. యన్టీఆర్ కు ఆ కథ తెగ నచ్చేసిందట. సో బుచ్చిబాబు లైన్ క్లియర్ అయిపోయినట్టే. 

Updated Date - 2022-01-25T16:55:10+05:30 IST