'బృంద' సిరీస్‌లో త్రిష..!

ABN , First Publish Date - 2021-10-16T13:51:22+05:30 IST

'బృంద' సిరీస్‌తో సీనియర్ హీరోయిన్ త్రిష డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవలే తెలుగు ఓటీటీ రంగంలోకి ఎంటర్ అయిన సోనీ లివ్ డిజిటల్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తోంది.

'బృంద' సిరీస్‌లో త్రిష..!

'బృంద' సిరీస్‌తో సీనియర్ హీరోయిన్ త్రిష డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవలే తెలుగు ఓటీటీ రంగంలోకి ఎంటర్ అయిన సోనీ లివ్ డిజిటల్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తోంది. సోనీ లివ్ మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ కావడం విశేషం. డెబ్యూ డైరెక్టర్ సూర్య వంగల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తం 8 ఎపిసోడ్స్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్ రూపొందనుండగా.. సాయి కుమార్ - ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 



ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నిర్మాతగా మారుతున్నారు. ఇక ఈ సిరీస్‌కు శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించబోతున్నారు. 'నాయకి' సినిమా తర్వాత మళ్ళీ ఇంతకాలానికి తెలుగులో 'బృంద' సిరీస్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న త్రిష ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా ఆమె తమిళంలో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' మూవీతో పాటు పలు క్రేజీ మూవీస్‌లో నటిస్తోంది. 


Updated Date - 2021-10-16T13:51:22+05:30 IST