ఇద్దరు ఖాన్లతో కలసి.. హృతిక్ భీకర యాక్షన్!

ABN , First Publish Date - 2022-01-29T22:49:19+05:30 IST

బాలీవుడ్‌లో ఒక వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అభిమాలందరూ అది నిజం అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బీ టౌన్ స్టార్ హీరోలు ముగ్గురు

ఇద్దరు ఖాన్లతో కలసి.. హృతిక్ భీకర యాక్షన్!

బాలీవుడ్‌లో ఒక వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అభిమాలందరూ అది నిజం అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బీ టౌన్ స్టార్ హీరోలు ముగ్గురు ఒకే మల్టీస్టారర్ స్పై థ్రిల్లర్‌లో నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్లితే..


బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఒకే చిత్రంలో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. గతంలో ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’‌లో సల్మాన్ ఖాన్ టైగర్ పాత్రను పోషించారు. ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ కబీర్‌గా నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ ‘పఠాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే  షారూక్ పఠాన్‌గా, సల్మాన్ ఖాన్ టైగర్‌గా, హృతిక్ రోషన్ కబీర్‌గా ఒకే మూవీలో కనిపించనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను యశ్ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.      


పఠాన్,  టైగర్-3 స్క్రిప్ట్ బాలీవుడ్‌లో చాలా మందికి తెలుసు. ఈ రెండు చిత్రాల్లో కబీర్ పాత్ర ఎక్కడ లేదు. యశ్‌రాజ్ ప్రొడక్షన్స్ అధినేత ఆదిత్య చోప్రా వ్యూహాత్మకంగా గూఢచారుల పాత్రలతో ప్రాంచైజ్‌ని రూపొందిస్తున్నారు. ‘వార్-2’ మూవీ అనంతరం సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ వెండితెరపై కలుస్తారట. ఆ ఆలోచన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నట్టు సమాచారం. 


సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్,  షారూక్ ఖాన్ పక్కన హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తారని కూడా బీ-టౌన్‌లో ప్రచారం సాగుతోంది. అయితే, ముగ్గురు క్రేజీ స్టార్ హీరోలను ఒకే తెరపై చూపించి ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేయాలని  ఆదిత్య చోప్రా ఆలోచిస్తున్నారట. ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మాదిరి అనుభూతిని ప్రేక్షకులకు మిగల్చాలని ఆది చోప్రా భావిస్తున్నట్టు యశ్ రాజ్ ప్రొడక్షన్స్‌కు చెందిన ఒక వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం ‘పఠాన్, టైగర్-3’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ‘వార్-2’ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తరువాతే సూపర్ హీరోలు ముగ్గురు ఒకేసారి యాక్షన్‌కి దిగబోయేది..

Updated Date - 2022-01-29T22:49:19+05:30 IST