సోషల్ మీడియాకు తిరిగి ఎంట్రీ .. శిల్పాశెట్టిని కాకుండా వేరే అకౌంట్ను ఫాలో అవుతోన్న రాజ్ కుంద్రా..
ABN , First Publish Date - 2022-01-17T00:38:52+05:30 IST
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపార వేత్త రాజ్ కుంద్రా. గతేడాది నవంబర్లో ఆయన పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపార వేత్త రాజ్ కుంద్రా. గతేడాది నవంబర్లో అతడు పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్నారు. అయితే, గతంలో సోషల్ మీడియాలో అతడు చాలా చురుకుగా ఉన్నప్పటికి కేసులో ఇరుక్కోవడంతో తన పాత పోస్ట్లను కుంద్రా డిలీట్ చేశారు. తాజాగా అతడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను తిరిగి ఓపెన్ చేశారు. అతడు ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాలో ఒక్క అకౌంట్ను మాత్రమే ఫాలో అవుతున్నారు. అతడు ఫాలో అయ్యేది శిల్పాశెట్టిని అనుకుంటే మీరు పొరపడినట్లే. మరి ఫాలో అయ్యేది ఎవరిననేది తెలుసుకోవాలనుందా.. ఈ స్టోరీని చదివేయండి మరి..
ముంబై పోలీసులు ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను గతేడాది జులైలో అరెస్టు చేశారు. అనంతరం ఒక నెల తర్వాత అతడు బయటకు వచ్చారు. బెయిలు మీద బయటకు వచ్చినప్పటికి కొన్ని రోజులు ఎవరి కంటాపడలేదు. గతేడాది నవంబర్లో మాత్రమే ప్రజలకు కనిపించారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్కు అతడు తిరిగి ఎంట్రీ ఇచ్చారు. అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు దాదాపుగా 10లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ అకౌంట్కు వెరిఫైడ్ మార్క్ ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే అతడు ఒకే అకౌంట్ను ఫాలో అవుతున్నారు. శిల్పాశెట్టి లేదా కుంద్రా కొడుకు వియాన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవుతున్నాడు అనుకుంటే మీరు పొరపడినట్లే. బాంద్రాలోని సీ ఫుడ్ రెస్టారెంట్ అకౌంట్ను ఫాలో అవుతున్నారు. ఆ రెస్టారెంట్లో అతడికి భాగస్వామ్యం ఉంది. ఇక పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకోవడంతో 2021 డిసెంబరులో రాజ్ కుంద్రా ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘నేను ఫోర్నగ్రఫీ చిత్రాలను నిర్మించలేదు. డిస్ట్రిబ్యూట్ చేయలేదు’’ అని అతడు చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానంలో కొనసాగుతోంది.