‘పదే పదే అవే సినిమాలు చేసి అలసిపోయా.. అందుకే విరామం తీసుకున్నా’

ABN , First Publish Date - 2022-01-24T18:03:44+05:30 IST

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా నటీమణులకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆయా హీరోయిన్లకు మంచి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్స్‌నే దర్శకులు మళ్లీ మళ్లీ ఆఫర్ చేస్తూ ఉంటారు...

‘పదే పదే అవే సినిమాలు చేసి అలసిపోయా.. అందుకే విరామం తీసుకున్నా’

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా నటీమణులకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆయా హీరోయిన్లకు మంచి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్స్‌నే దర్శకులు మళ్లీ మళ్లీ ఆఫర్ చేస్తూ ఉంటారు. గతంలో క్లిక్ అయిన క్యారెక్టర్లకు హీరోయిన్లను తీసుకుంటూ ఉంటారు. అయితే చేసిన క్యారెక్టర్లనే మళ్లీ మళ్లీ చేయలేక హీరోయిన్లు తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. చివరకు విసుగొచ్చి ఇండస్ట్రీకే గుడ్ బై చెబుతూ ఉంటారు. తన జీవితంలో కూడా అచ్చం అలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నానని బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..


‘నిజాయితీగా చెప్పాలంటే నేను 30 ఏళ్ల వయసుకు చేరుకునే సరికి కొంచెం అలసిపోయినట్లు ఫీల్ అయ్యా. ఎందుకంటే అప్పట్లో సినిమాల్లో గ్లామరస్ నటిని పెట్టాలి కాబట్టి హీరోయిన్స్‌ని పెట్టేవాళ్లు. అందుకే ఎక్కువగా హీరో గర్ల్‌ఫ్రెండ్ లేదా భార్యగా నటించేవాళ్లం. నేను నటించిన ప్రతీ సినిమాలోనూ అంతే. 


అయితే ప్రియురాలు.. లేదంటే హీరోకు భార్య. వేరే ఇతర క్యారెక్టర్లు ఏమీ నాకు పెద్దగా రాలేదు. అందుకే అలాంటి క్యారెక్టర్స్ చేసి విసిగిపోయాను. ఎప్పుడూ ఇలాంటి పాత్రలేనా.. అన్న ఫీలింగ్ నుంచి బయటపడటానికి మధ్యమధ్యలో కొన్ని కామెడీ సినిమాలు కూడా చేశాను. వాటిల్లోనే నటించేందుకు కాస్త స్కోప్ ఉంటుంది కదా’.. అంటూ లారా దత్తా చెప్పుకొచ్చింది. 


అదే సమయంలో తన భర్త, టెన్సీస్ మాజీ క్రీడాకారుడు మహేశ్ భూపతి గురించి కూడా చెప్పుకొచ్చింది. ‘నన్ను ఆయన ప్రాణంగా చూసుకుంటారు. ఆయనతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాను. మా ఇద్దరి ముద్దుల కూతురు సైరాతో నేను ఎక్కువ సమయం గడపటానికి మొగ్గుచూపాను. అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాను ’ అంటూ లారా దత్తా వెల్లడించింది. కాగా, గతంలో ‘నో ఎంట్రీ’, ‘భాగం భాగ్’, ‘పార్టనర్’, ‘హౌస్‌ఫుల్’ సిరీస్ సినిమాలతో లారా దత్తా తనదైన ముద్రను వేసింది.

Updated Date - 2022-01-24T18:03:44+05:30 IST