ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లు పూర్తవడంతో కొత్త ప్రయాణం ప్రారంభించిన Kriti Sanon

ABN , First Publish Date - 2022-05-24T02:20:41+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్(Kriti Sanon). బాలీవుడ్‌లో వరుస సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. మహేశ్ బాబు నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమాతో

ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లు పూర్తవడంతో కొత్త ప్రయాణం ప్రారంభించిన Kriti Sanon

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్(Kriti Sanon). బాలీవుడ్‌లో వరుస సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. మహేశ్ బాబు నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ‘హీరోపంటీ’ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటించి బీ టౌన్‌కీ ఎంట్రీ ఇచ్చింది. ‘రాబ్తా’ (Raabta), ‘దిల్‌వాలే’ (Dilwale), ‘లుకా చప్పీ’(Luka Chuppi), ‘మిమి’(Mimi) వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. మే 23తో ఇండస్ట్రీలో ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎంటర్ ప్రెన్యూర్‌గా మారింది.  


కృతి సనన్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న సంగతి కూడా తెలిసిందే. ఎప్పుడు ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీంతో ఫిట్‌నెస్ యాప్ ‘ది ట్రైబ్’(The Tribe)లో పెట్టుబడులు పెట్టింది. రాబిన్ బెహ్ల్, కరణ్ సాహ్ని, అనుష్క నందానీతో కలసి అందులో ఇన్వెస్ట్‌ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘నాకు మే 23 చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. నా జీవితం ఎనిమిదేళ్ల క్రితం మలుపు తిరిగింది. ఎందుకంటే ఈ రోజే హీరోయిన్‌గా నా ప్రయాణం మొదలుపెట్టాను. నేను టాలెంట్ ఉన్న మరికొందరికీ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నా జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను’’ అని కృతి సనన్ చెప్పింది. ఇక కెరీర్ విషయానికీ వస్తే.. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘బచ్చన్ పాండే’లో ఆమె నటించింది. కానీ, ఈ చిత్రం అభిమానులను మెప్పించలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’లో జానకీ పాత్రలో కనపించనుంది. ఈ చిత్రానికీ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.



Updated Date - 2022-05-24T02:20:41+05:30 IST