భారత క్రికెటర్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న జూనియర్ అతిలోక సుందరి.. ఆ సినిమా కోసమే..

ABN , First Publish Date - 2022-01-26T21:03:55+05:30 IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి జాన్వీ కపూర్ తనకంటూ గుర్తింపు పొందింది...

భారత క్రికెటర్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న జూనియర్ అతిలోక సుందరి.. ఆ సినిమా కోసమే..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ గుర్తింపు పొందింది. మొదటి సినిమా ‘ధడక్’తోనే మంచి నటిగా ఈ బ్యూటీ అందరి ప్రశంసలు అందుకుంది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో ఈ భామ దూసుకుపోతోంది. ఈ జూనియర్ అతిలోక సుందరి తాజాగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’.


రాజ్ కుమార్ రావు హీరోగా చేస్తున్న ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో జాన్వీ నటిస్తోంది. అందుకోసమే ప్రత్యేకంగా భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద బ్యాటింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను రిపబ్లిక్ డే రోజున సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ పిక్‌లో హెల్మెట్ పెట్టుకొని స్టైలిష్‌గా ఈ సుందరి కనిపిస్తోంది. మరో ఫొటోలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఇంకో దాంట్లో మూవీ టీంతో కలిసి సరదాగా ముచ్చటిస్తోంది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


అయితే గతేడాది నవంబర్‌లోనే ఓ వీడియోని షేర్ చేసి ఈ సినిమా గురించి దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించాడు. దీనికి.. ‘ ఓ అందమైన కల.. సాకారం చేసుకోవడానికి రెండు హృదయాలు ప్రయత్నిస్తున్నాయి. శరన్ శర్మ మనసులను కదిలించేలా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’కి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు నటిస్తున్నారు. అక్టోబర్ 7, 2022లో థియేటర్స్‌లో కలుద్దాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ నటీనటులు తమ స్టోరీని చెబుతుంటారు. అయితే ఈ మూవీలో ఈ ఇద్దరు నటులు కూడా క్రికెటర్స్‌గానే నటిస్తుండడం విశేషం.



Updated Date - 2022-01-26T21:03:55+05:30 IST