జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2021-09-18T04:40:52+05:30 IST

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 25న విచారణకు హాజరవ్వాలని తెలిపింది...

జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 25న విచారణకు హాజరవ్వాలని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ ఈడీ విచారణలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరు బయటపెట్టాడు. దాంతో ఆగస్టులో ఆమెను ఈడీ ఆరుగంటల పాటు విచారించింది. కేసులో ఆమె పాత్రను నిగ్గు తేల్చేందుకు ఈడీ మరోసారి జాక్వెలిన్‌ను ప్రశ్నించాలని భావించింది. అయితే ఈ కేసులో ఆమె సూత్రధారి కాదు బాధితురాలు మాత్రమే అని జాక్వెలిన్‌ సన్నిహితులు చెపుతున్నారు.

Updated Date - 2021-09-18T04:40:52+05:30 IST