అందులో నా యాక్టింగ్ చూసి డైరెక్టర్ ‘వావ్’ అంటాడనుకున్నా.. కానీ.. : ‘లైగర్’ భామ

ABN , First Publish Date - 2022-01-21T18:02:10+05:30 IST

బాలీవుడ్ నటి అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అక్కడ అందంతో పాటు అభినయంతోనూ..

అందులో నా యాక్టింగ్ చూసి డైరెక్టర్ ‘వావ్’ అంటాడనుకున్నా.. కానీ.. : ‘లైగర్’ భామ

బాలీవుడ్ నటి అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అక్కడ అందంతో పాటు అభినయంతోనూ అభిమానుల మనసులు దోచుకున్న ఈ భామ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘గెహ్రయాన్’. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో కలిసి నటిస్తుండగా.. శాకున్ బత్రా దర్శకత్వం వహిస్తున్నాడు.


ఆధునిక సమాజంలో బంధాల కోణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి వ్యూయర్‌షిప్‌ని సొంతం చేసుకుంది. కాగా ఫిబ్రవరిలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్రబృందం. అందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాల గురించి పంచుకుందీ ఈ ‘లైగర్’ భామ.


ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నేను నిజంగా ఏడ్చి, నా భావోద్వేగాలన్నీ చూపించాల్సి వచ్చింది. ఇది నాకేంతో ముఖ్యం అని స్క్రిప్ట్‌ చదివినప్పుడే అనుకున్నాను. షూటింగ్ రోజు శకున్ బయట కూర్చోగా. సీన్ కోసం నేను రూమ్‌లోకి వెళ్లి ఏడ్వడం మొదలుపెట్టాను. పూర్తయిన తర్వాత డైరెక్టర్ చూసి వావ్ చాలా బాగా చేశావ్ అంటాడు అనుకుంటూ బయటికి వచ్చా. నన్ను చూసి ఆయన నా మొహం మీదే నవ్వేశాడు. అప్పుడు ఇంత దారుణంగా చేశానా అనిపించింద’ని తెలిపింది.


అంతేకాకుండా అనన్య ఇంకా మాట్లాడుతూ.. ‘ఎవరైనా ఏడిస్తే శకున్‌కి నవ్వస్తుందనుకుంటా. అది ఆయన సమస్య కావొచ్చు. నిజానికి ఆయన చాలా సెన్సిటివ్ డైరెక్టర్.. అందుకే అలాంటి విషయాలను తట్టుకోలేడు. ఒకసారి దీపిక, నేనూ ఎమోషనల్ అయ్యే సన్నివేశంలో నటిస్తున్నాం. కానీ ఆయన నవ్వు ఆపుకోలేకపోతుండడంతో వేరే గదిలోకి పంపించాల్సి వచ్చింద’ని చెప్పింది.

Updated Date - 2022-01-21T18:02:10+05:30 IST