మూడు రంగుల గడ్డంతో అమితాబ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. పిక్ వైరల్
ABN , First Publish Date - 2022-01-26T16:47:54+05:30 IST
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే...
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అందుకే ఇప్పటికీ ఆయన నటిస్తున్న సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఆయన అభిమానులు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్గా ఉంటూ.. వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటాడు ఈ సూపర్ స్టార్.
తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన పిక్ షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు బిగ్ బీ. అందులో అమితాబ్ గడ్డానికి మన దేశ జాతీయ పతాకంలోలాగా మూడు రంగులు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.
ఎంతో వినూత్నంగా ఉన్న ఈ అమితాబ్ పిక్ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది. దీంతో వరుస కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం ఆయన పోస్ట్పై స్పందించారు. అందులో.. ‘సార్! శుభాకాంక్షలు ఎంతో బాగా చెప్పారు.. హ్యాపీ గణతంత్ర దినోత్సవం’ అంటూ ఆయన ఫొటోపై కామెంట్ పెట్టింది నటి దివ్య దత్తా.