OTT డీల్‌: ‘నారప్ప’కు 40, ‘దృశ్యం2’కు 36

ABN , First Publish Date - 2021-07-14T03:12:05+05:30 IST

వెంకటేష్‌ నటించిన ఈ రెండు చిత్రాలకు భారీ డీల్‌ లభించింది కాబట్టే.. డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేస్తున్నారనేలా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ నటించిన 'నారప్ప' చిత్రం

OTT డీల్‌: ‘నారప్ప’కు 40, ‘దృశ్యం2’కు 36

‘నారప్ప’కు 40, ‘దృశ్యం2’కు 36 అంటే కొంచెం కన్ఫ్యూజ్‌ అయి ఉండొచ్చు. అయితే వెంకటేష్‌ నటించిన ఈ రెండు చిత్రాలకు భారీ డీల్‌ లభించింది కాబట్టే.. డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేస్తున్నారనేలా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ నటించిన 'నారప్ప' చిత్రం జూలై 20న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కాబోతున్న విషయం తెలిసిందే. 'నారప్ప' చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ రూ. 40 కోట్లకు దక్కించుకున్నట్లుగా తాజాగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినవస్తున్నాయి. రూ. 40 కోట్లు అంటే నిజంగా ఇది భారీ డీలే. విక్టరీ వెంకీ పరంగా ఈ డీల్‌కి చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడమే బెటర్‌. అందులోనూ కరోనా టైమ్‌లో ఇంత భారీ డీల్‌ రావడం మాములు విషయం కాదు. 


ఇక ఈ చిత్రం తర్వాత వెంకటేష్‌ చేస్తున్న మరో చిత్రం 'దృశ్యం 2'ని కూడా దాదాపు ఇదే స్థాయిలో మరో ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందని అంటున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సంస్థ ‘దృశ్యం2’ రైట్స్‌ను రూ. 36 కోట్లకు సొంతం చేసుకుందట. కరోనా టైమ్‌లో, థియేటర్ల పరిస్థితి ధీనంగా ఉన్న సందర్భంలో ఓటీటీ సంస్థల నుంచి దాదాపు వెంకీ చిత్రాలకు రూ. 76 కోట్లకు డీల్‌ కుదరడమనేది మాములు విషయం కాదు. ఇప్పుడీ వార్తలే టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. అయితే ఈ డీల్‌ పై నిర్మాతలు మాత్రం పెదవి విప్పలేదు.  

Updated Date - 2021-07-14T03:12:05+05:30 IST