bhramam : మలయాళ ‘అంధాధున్’ కూడా ఓటీటీలోనే !

ABN , First Publish Date - 2021-09-23T16:08:22+05:30 IST

శ్రీరామ రాఘవన్ దర్శకత్వంలో బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్యపాత్రలు పోషించిన ఈసినిమాని తెలుగులో ‘మాస్ట్రో’ గా రీమేక్ చేయగా.. రిసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. సినిమా పర్వాలేదనిపించుకుంది.

bhramam : మలయాళ ‘అంధాధున్’ కూడా ఓటీటీలోనే !

శ్రీరామ రాఘవన్ దర్శకత్వంలో బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్యపాత్రలు పోషించిన ఈసినిమాని తెలుగులో ‘మాస్ట్రో’ గా రీమేక్ చేయగా..  రిసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. సినిమా పర్వాలేదనిపించుకుంది. యంగ్ హీరో నితిన్ , తమన్నా, నభా నటేశ్, జిషుసేన్ గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఇదే సినిమా మలయాళంలో సైతం రీమేక్ అయింది. ఈ చిత్రాన్ని సైతం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సినిమా పేరు ‘భ్రమం’. అక్టోబర్ 7న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు.



యంగ్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్, మమతా మోహన్ దాస్, రాశీఖన్నా , ఉన్నీ ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి రవి కె చంద్రన్ దర్శకుడు. ఇంతకు ముందు మోహన్ లాల్ ‘విలన్’ సినిమాతో మలయాళ ఇండస్ట్రీస్ లోకి అడుగుపెట్టిన రాశీఖన్నాకిది రెండో మలయాళ చిత్రం. ఇక ‘ఈ సినిమాలో నటిస్తున్నందుకు తనకి చాలా గర్వంగా ఉంది’ అని హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. మరి ‘అంధాధున్’ మలయాళ వెర్షన్ తో పృధ్విరాజ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి.  

Updated Date - 2021-09-23T16:08:22+05:30 IST