'భీమ్లా నాయక్': భారీ ఓటీటీ ఆఫర్..?

ABN , First Publish Date - 2021-10-22T17:45:40+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకి భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న

'భీమ్లా నాయక్': భారీ ఓటీటీ ఆఫర్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకి భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే్‌తో పాటు డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే పవన్, రానాల టీజర్స్..ఇటీవల రిలీజైన సాంగ్స్ 'భీమ్లా నాయక్' మూవీ మీద భారీ అంచనాలను పెంచాయి. దాంతో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వారు 150 కోట్ల భారీ ఓటీటీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పవన్ స్టామినాకి ఈజీగా వంద కోట్ల షేర్ వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ మరో 70 నుంచి 80 కోట్ల వరకు అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ ఆఫర్‌ను మేకర్స్ ఒప్పుకోరనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ మూవీ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో.

Updated Date - 2021-10-22T17:45:40+05:30 IST