'భీమ్లా నాయక్': సెకండ్ సింగిల్ డిసప్పాయింట్ చేసిందా..?

ABN , First Publish Date - 2021-10-17T15:57:42+05:30 IST

పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకుడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

'భీమ్లా నాయక్': సెకండ్ సింగిల్ డిసప్పాయింట్ చేసిందా..?

పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకుడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మేనన్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి 'అంత ఇష్టం ఏందయ్యా' అనే లిరికల్ సాంగ్ రిలీజైంది. అయితే ఈ సాంగ్ ఆశించినంతగా ఆకట్టుకోలేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే సెకండ్ సింగిల్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారట. ఫస్ట్ సింగిల్..పవన్, రానాల ఇంట్రో టీజర్స్‌కి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి ట్రెండ్ అయ్యాయి. అంతకంటే ఎక్కువ వ్యూస్ రాబడుతుందనుకున్న సెకండ్ సింగిల్ మాత్రం అందరూ ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. ఈ సాంగ్‌కు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర పాడారు. చూడాలి మరి నెమ్మదిగా ఏమైనా ప్రేక్షకులను ఆక్ట్టుకుంటుందేమో.  



Updated Date - 2021-10-17T15:57:42+05:30 IST