బెల్లంకొండ డ్రాప్ అయ్యాడా?

ABN , First Publish Date - 2022-01-23T21:25:06+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే మూవీ మొన్నామధ్య అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పేరుమోసిన క్రిమినల్ నాగేశ్వరరావు జీవిత కథ ఇది. వంశీ ఆకేళ్ళ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ప్రకటన వెలువడిన రెండు రోజులకు ఇదే కథతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్ట్‌పురం దొంగ’ అనే ప్రకటన కూడా వచ్చింది. బెల్లంకొండ సురేశ్ నిర్మాణంలో కెయస్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందని, త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోందని కూడా తెలిపారు.

బెల్లంకొండ డ్రాప్ అయ్యాడా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ రీసెంట్ గా అనౌన్స్‌ అయిన సంగతి తెలిసిందే. గతంలో పేరుమోసిన క్రిమినల్ నాగేశ్వరరావు జీవిత కథ ఇది. వంశీ ఆకేళ్ళ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ప్రకటన వెలువడిన రెండు రోజులకు ఇదే కథతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్ట్‌పురం దొంగ’ అనే ప్రకటన కూడా వచ్చింది. బెల్లంకొండ సురేశ్ నిర్మాణంలో కెయస్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందని, త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోందని కూడా తెలిపారు. ఇలా ఒక వ్యక్తి బయోపిక్ తో ఏక కాలంలో రెండు సినిమాల ప్రకటన రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వీటిలో ఏదో ఒకటి డ్రాప్ అవుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు దానికి పూర్తి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.


బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్టువర్ట్‌పురం దొంగ’ మూవీని ఆపేస్తున్నారట. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ బడ్జెట్ పెద్దవడం.. దానికి స్ర్కిప్ట్ కూడా అద్భుతంగా వచ్చిందనే సమాచారం కూడా రావడంతో ఈ సినిమాను ఆపేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట బెల్లంకొండ  సురేశ్.  బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం హిందీ ‘ఛత్రపతి’ షూటింగ్ తో పూర్తి బిజీగా ఉండడం వల్ల.. రవితేజ సినిమానే ముందుగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. దానికి తగ్గట్టుగానే  ఈ ఏడాది తను కమిట్ అయిన సినిమాల్లో ఒకదాన్ని పక్కన పెట్టి  ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను ద్వితీయార్ధంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట రవితేజ. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.

Updated Date - 2022-01-23T21:25:06+05:30 IST