క్రైమ్‌ థ్రిల్లర్‌ ఆధారంగా

ABN , First Publish Date - 2021-11-29T11:08:05+05:30 IST

నూతన నటీనటులతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఆధారం’. సూర్య భరత్‌ చంద్ర, రేణుశ్రీ, నిరుషా హీరో, హీరోయిన్లుగా నటించారు. గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు...

క్రైమ్‌ థ్రిల్లర్‌ ఆధారంగా

నూతన నటీనటులతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఆధారం’. సూర్య భరత్‌ చంద్ర, రేణుశ్రీ, నిరుషా హీరో, హీరోయిన్లుగా నటించారు. గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇటీవలె ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్‌ విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గోపి పోలవరపు మాట్లాడుతూ ‘‘ప్రతిభావంతులైన కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించాలని ఈ సినిమా చేస్తున్నాను. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. సంగీత దర్శకుడు నజీర్‌ అందించిన రెండు పాటలు సినిమాకు ప్రత్యేకాకర్షణ’’ అన్నారు. మోహన్‌బాబు తొలిసారి హీరోగా నటించిన ‘కేటుగాడు’ చిత్ర నిర్మాత వల్లూరి పల్లి వెంకట్రావు తనయ సితార ఈ సినిమాకు సమర్పకురాలు.


Updated Date - 2021-11-29T11:08:05+05:30 IST