హీరోలను పాంపర్ చేయాల్సిన పని లేదు: బండ్ల గణేశ్
ABN , First Publish Date - 2021-11-28T23:15:50+05:30 IST
‘‘సినిమా ఒకటే నాకు జీవితం కాదు. అది నా జీవితంలో చిన్న భాగం మాత్రమే. అంతకు మించిన లైఫ్ నాది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్నేహితులు ఉన్నారో.. రాజకీయంగానూ అంతే’’ అని అంటున్నారు బండ్ల గణేష్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొంతమంది దర్శకులు, హీరోలను ఆయన మోసం చేశాడనే మాటల్ని బండ్ల గణేశ్ ఖండించారు.
‘‘సినిమా ఒకటే నాకు జీవితం కాదు. అది నా జీవితంలో చిన్న భాగం మాత్రమే. అంతకు మించిన లైఫ్ నాది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్నేహితులు ఉన్నారో.. రాజకీయంగానూ అంతే’’ అని అంటున్నారు బండ్ల గణేష్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొంతమంది దర్శకులు, హీరోలను ఆయన మోసం చేశాడనే మాటల్ని బండ్ల గణేశ్ ఖండించారు. గతంలో భూములు అమ్మకాలు, కొనుగోలు విషయంలో బండ్ల గణేష్ దర్శకుడు కృష్ణవంశీని, హీరో రవితేజను మోసం చేశాడనే మాటల్లో నిజం లేదని ఆయన చెప్పారు. ‘‘నేను తప్పుడు స్థలం అమ్మినట్టు ఎవరైనా నా ముందుకొచ్చి చెప్తే.. దేనికైనా రెడీగానే ఉన్నా. రవితేజ, కృష్ణవంశీ నా దగ్గర పొలాలు కొనుక్కుని ఆ తర్వాత అమ్ముకున్నారు. మేం వ్యాపారాలు చేశాం. వారిద్దరితోనూ నాకు ఎలాంటి వివాదాలు లేవు. పనీ పాట లేకుండా సాయంత్రం సినిమా ఆఫీస్లో కూర్చొని కబుర్లు చెప్పుకునే బ్యాచ్ ఇలాంటివి పుట్టిస్తుంటారు. నాకు అంత టైమ్ లేదు. చాలా పనులున్నాయి. నేను ఎవ్వర్నీ మోసం చేయలేదు. చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. నా గురించి ఎదుటివారు అలా అనుకుంటే నేనేమీ చేయలేను’’ అని పేర్కొన్నారు.
"ఇప్పట్లో సినిమాలు తీసే ఆలోచన లేదు. హీరోలను పాంపర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మంచి కథ దొరికితే దానికి తగ్గ హీరోతో సినిమా చేస్తాం. ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్ తీసినట్టు.. నా జీవితాన్ని కూడా బయోపిక్గా తీయవచ్చు. నా కథలో అని మలుపులున్నాయి" అని పేర్కొన్నారు బండ్ల గణేష్.