హరీష్‌ శంకర్‌ మార్క్‌తో డిజిటల్‌ ఎంట్రీ

ABN , First Publish Date - 2022-01-28T04:52:13+05:30 IST

సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా తొలిసారి వెబ్‌సిరీస్‌ నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నట్టు నిర్మాత దిల్‌రాజు గురువారం అధికారికంగా ప్రకటించారు....

హరీష్‌ శంకర్‌ మార్క్‌తో డిజిటల్‌ ఎంట్రీ

సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా తొలిసారి వెబ్‌సిరీస్‌ నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నట్టు నిర్మాత దిల్‌రాజు గురువారం అధికారికంగా ప్రకటించారు. జీ5 సంస్థతో కలసి ‘ఎటీఎం’ అనే వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. దర్శకుడు ఎస్‌. హరీష్‌ శంకర్‌ ఈ సిరీస్‌కు కథ అందించడంతో పాటు హర్షిత్‌రెడ్డి, హన్షితలతో కలసి నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు. చంద్రమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీశాం. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని ‘ఎటీఎం’ వెబ్‌సిరీస్‌ ప్లాన్‌ చేశాం. కొత్త కాన్సెప్ట్‌తో, హరీష్‌ శంకర్‌ మార్క్‌తో వెబ్‌సిరీస్‌ ఉంటుంది. హర్షిత్‌, హన్షిత వెబ్‌సిరీస్‌లతో పాటు కొత్త కంటెంట్‌తో సినిమాలు కూడా నిర్మిస్తారు’ అని దిల్‌రాజు చెప్పారు. ‘ఇది అందరికీ నచ్చే కథ. చంద్రమోహన్‌ ప్రతిభావంతుడైన దర్శకుడు. కథలో మార్పులు చేసి ఫ్రెష్‌నెస్‌ తెచ్చాడు’ అని ఎస్‌. హరీష్‌ శంకర్‌ అన్నారు. హరీష్‌ శంకర్‌ గురువులా నన్ను నడిపించారు అని చంద్రమోహన్‌ చెప్పారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించిన వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఇకపై ఓటీటీలోనూ  సత్తా చాటుతుందని దిల్‌రాజు తనయ హన్షిత అన్నారు.

Updated Date - 2022-01-28T04:52:13+05:30 IST