అధర్వ మురళి ‘అడ్రస్‌’ అప్‌డేట్

ABN , First Publish Date - 2021-10-23T03:24:53+05:30 IST

యువ హీరో అధర్వ మురళి ముఖ్య పాత్రలో నటించిన ‘అడ్రస్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. ‘కుంకుంపూవుమ్‌ కొంజుం పురావుమ్‌’, ‘వానవరాయన్‌ వల్లవరాయన్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు

అధర్వ మురళి ‘అడ్రస్‌’ అప్‌డేట్

యువ హీరో అధర్వ మురళి ముఖ్య పాత్రలో నటించిన ‘అడ్రస్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. ‘కుంకుంపూవుమ్‌ కొంజుం పురావుమ్‌’, ‘వానవరాయన్‌ వల్లవరాయన్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజమోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 


ఈ చిత్రం గురించి దర్శకుడు రాజమోహన్‌ వివరిస్తూ, ‘మన దేశంలో చిరునామా లేని ఓ గ్రామం ఉంది. ఇది నిజం. గత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సమయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య చిక్కుకుని ఉన్న ఓ గ్రామానికి చిరునామా లభించిందా? లేదా? అన్నదే ఈ చిత్ర కథ. ఒక వాస్తవిక సంఘటను ఆధారంగా చేసుకుని ఎంతో థ్రిల్లింగ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. కరోనా నిబంధనల మధ్య ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేశాం. ఇందులో అధర్వ మురళి ఒక విప్లవాత్మకమైన కాళి అనే యువకుడి పాత్రలో నటించారు. స్నేహం కోసమే ఈ పాత్రలో నటించేందుకు సమ్మతించారు. అధర్వ మురళి సరసన పూజా జవేరి నటించగా, శక్తి భరత్‌, కొత్త నటి దియా, తంబిరామయ్య, దేవదర్షిణి, ఏ. వెంకటేష్‌, మద్రాస్‌ నందకుమార్‌, నాగేంద్రన్‌, గోలీసోడా ముత్తు తదితరులు నటించారు. క్రిష్‌ గోపాలకృష్ణన్‌ సంగీతం సమకూర్చగా, స్నేహనన్‌, మోహన్‌ రాజన్‌, గానా హరిలు గేయ రచన చేశారు’ అని వివరించారు. 

Updated Date - 2021-10-23T03:24:53+05:30 IST