Captain OTT release: ఓటీటీలోకి ఆర్య సైన్స్ ఫిక్షన్ చిత్రం.. ఎప్పుడు, ఎక్కడంటే..
ABN , First Publish Date - 2022-09-23T16:52:28+05:30 IST
టాలీవుడ్లో పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది తమిళ నటుల్లో ఆర్య (Arya) ఒకరు. ఈ యువ నటుడు అల్లు అర్జున్ ‘వరుడు’ చిత్రంతో..
టాలీవుడ్లో పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది తమిళ నటుల్లో ఆర్య (Arya) ఒకరు. ఈ యువ నటుడు అల్లు అర్జున్ ‘వరుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యాడు. అప్పటి నుంచి ఆయన ప్రతి చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యి ఇక్కడ కూడా విడుదల అవుతోంది. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘కెప్టెన్’(Captain). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ని అందుకుంది.
శక్తి సౌందర్ రాజన్ రచన, దర్శకత్వం వహించిన ‘కెప్టెన్’ చిత్రంలో ఆర్యకి జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి. కిషోర్తో కలిసి ఆర్య నిర్మించాడు. అయితే.. యావరేజ్ టాక్ రావడంతో ఈ మూవీ నిర్మాతలకి భారీగా నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే. .ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ (OTT release Date) వచ్చేసింది. విడుదలై మూడు వారాలు తిరక్కముందే అంటే సెప్టెంబర్ 30 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
దీని గురించి జీ5 సీబీవో మనిష్ కార్లా మాట్లాడుతూ.. ‘సినిమా నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలతోపాటు అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కింది. యాక్షన్, సైన్స్ ఫిక్షన్ వంటి బహుళ జానర్లతో ఈ మూవీ ప్రేక్షకులని అలరిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఓ ఆర్మీ కెప్టెన్ తన బృందంతో కలిసి ఓ అటవీ ప్రాంతంలోని ఏలియన్స్తో పోరాడటమే ఈ చిత్ర కథాంశం.