'సర్కారు వారి పాట': ఫస్ట్ సాంగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన థమన్

ABN , First Publish Date - 2021-10-22T13:11:12+05:30 IST

పరశురాం పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెకుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అప్‌డేట్ ఇచ్చారు.

'సర్కారు వారి పాట': ఫస్ట్ సాంగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన థమన్

పరశురాం పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెకుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో మహేశ్ ఎంత స్టైలిష్‌గా ఉన్నాడో అందరూ చూశారు. ఇందులో ఆయనను ఎలివేట్ చేసే ఫస్ట్ సాంగ్ కూడా అంతే స్టైలిష్‌గా ఉండబోతోందని తాజాగా థమన్ కంపోజ్ చేసిన ట్యూన్ వింటే అర్థమవుతోంది. ప్రస్తుతం చిత్రబృందం స్పేయిన్‌లో చిత్రీకరణ జరుపుతోంది. మహేశ్, కీర్తి సురేశ్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, సాంగ్‌ను పూర్తి చేస్తున్నారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని సమాచారం. దానికి సంబంధించిన ట్యూన్‌నే తాజాగా థమన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్యూన్ బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని మహేష్ సొంత నిర్మాణ సంస్థతో కలిసి 14 రీల్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 



Updated Date - 2021-10-22T13:11:12+05:30 IST