'సర్కారు వారి పాట': ఫిబ్రవరి 14న ఫస్ట్ సింగిల్

ABN , First Publish Date - 2022-01-26T15:42:46+05:30 IST

'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఫిబ్రవరి 14 వ తేదీన ఫస్ట్ సింగిల్ రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రమిది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

'సర్కారు వారి పాట': ఫిబ్రవరి 14న ఫస్ట్ సింగిల్

'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఫిబ్రవరి 14 వ తేదీన ఫస్ట్ సింగిల్ రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రమిది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జీఎంబి ఎంటర్ టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. అయితే, చాలారోజుల నుంచి అభిమానులతో పాటు ప్రేక్షకులు 'సర్కారు వారి పాట' మ్యూజిక్ ఫీస్ట్ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఫిబ్రవరి నెలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 14వ తేదీన ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగ్‌ల్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా వదిలారు.  

Updated Date - 2022-01-26T15:42:46+05:30 IST