శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ మల్టీస్టారరా..?
ABN , First Publish Date - 2021-07-04T14:43:08+05:30 IST
శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో ఇటీవల ఓ త్రిభాషా చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధనుష్తో పాటు మరో హీరో కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. భారీ మల్టీస్టారర్ రేంజ్ స్క్రిప్ట్ దర్శకుడు శేఖర్ కమ్ముల సిద్దం చేశాడట.
శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో ఇటీవల ఓ త్రిభాషా చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధనుష్తో పాటు మరో హీరో కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. భారీ మల్టీస్టారర్ రేంజ్ స్క్రిప్ట్ దర్శకుడు శేఖర్ కమ్ముల సిద్దం చేశాడట. అయితే, మరో హీరో కోలీవుడ్ నటుడా..లేక టాలీవుడ్ నటుడా అనేది త్వరలో ఓ క్లారిటీ రానుంది. 'లవ్ స్టోరి' సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలబోతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరి' త్వరలో రిలీజ్ కాబోతోంది. నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించారు.