‘అరణ్య’: దసరా కానుకగా ఓటీటీలో విడుదల
ABN , First Publish Date - 2021-10-15T14:43:08+05:30 IST
రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. ఈ చిత్రానికి ప్రభు సోలమన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మార్చి 26న విడుదలైన ఈ సినిమా బాగానే ఆకట్టుంది.
రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. ఈ చిత్రానికి ప్రభు సోలమన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మార్చి 26న విడుదలైన ఈ సినిమా బాగానే ఆకట్టుంది. ముఖ్యంగా రానా పాత్రకి మంచి స్పందన లభించింది. ఈ సినిమా కోసం రానా తనని తాను మార్చుకున్న విధానానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. దసరా కానుక అక్టోబర్ 15 నుంచి జీ5లో ‘అరణ్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో శ్రీయ, విష్ణు విశాల్, జోయా హుస్సేన్ కీలక పాత్రలలో నటించారు. ఇక రానా నటించిన 'విరాట పర్వం' విడుదలకు సిద్దమవుతుండగా, పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్న 'భీమ్లా నాయక్' షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా 2022, సంక్రాంతికి కానుకగా రిలీజ్ కాబోతోంది. అలాగే బాబాయ్ విక్టరీ వెంకటేశ్తో కలిసి ఓటీటీ కోసం 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ను కూడా చేస్తున్నాడు.