ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

ABN , First Publish Date - 2021-12-02T15:11:03+05:30 IST

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చి ప్రజలు కష్టాలపాలైనా మేమున్నామంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఆసరగా ఉంటోంది.

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చి ప్రజలు కష్టాలపాలైనా మేమున్నామంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఆసరగా ఉంటోంది. ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ తమవంతు సహాయంగా విరాళాలు ప్రకటించి ప్రజలను ఆదుకుంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి తెలుగుచిత్ర పరిశ్రమలోని వారు అండగా నిలిచారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ రూ. 10 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు ప్రకటించగా.. తాజాగా అల్లు అర్జున్ తనవంతు సహాయంగా రూ. 25లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.



Updated Date - 2021-12-02T15:11:03+05:30 IST