Anupama Parameshwaran: రష్మిక, నయనతార బాటలో అనుపమ పరమేశ్వరన్ ..?
ABN , First Publish Date - 2022-08-18T20:35:35+05:30 IST
దక్షిణాది తారలంతా ఒక్కొక్కరిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna), నయనతార (Nayanthara) ఇప్పటికే హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. సమంత కూడా ఓ
దక్షిణాది తారలంతా ఒక్కొక్కరిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna), నయనతార (Nayanthara) ఇప్పటికే హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. సమంత కూడా ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. తాజాగా దక్షిణాదికి చెందిన మరో నటి హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆమెవరో కాదు తొలి సినిమా ‘ప్రేమమ్’ (Premam) తోనే కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran).
అనుపమ పరమేశ్వరన్ ‘అఆ’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూత్లోను ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుపమ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ఆమెను సంప్రదించినట్టు సమాచారం. భారీ చిత్రంతో ఆమెను లాంచ్ చేస్తామని మాటిచ్చినట్టు తెలుస్తోంది. ఆమె మాత్రం తన అంగీకారాన్ని తెలపలేదని కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రొడక్షన్ హౌసే దక్షిణాదికి చెందిన అనేక మందికీ తమ చిత్రాల్లో నటించే అవకాశమిచ్చింది. ఒకవేళ అనుపమ మాత్రం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తే ఆమె కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందన్నడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అనుపమ తాజాగా ‘కార్తికేయ-2’ లో నటించింది. ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించాడు. చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు రాష్రాల్లో ఇప్పటికే సంచలన విజయం సాధించింది. హిందీలోను రికార్డు స్థాయి కలెక్షన్స్ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.