Victory Venktesh కు జాతిరత్నం దొరికాడా?

ABN , First Publish Date - 2022-06-29T18:33:16+05:30 IST

గతేడాది ‘నారప్ప (Narappa), దృశ్యం 2 (Drishyam 2)’ చిత్రాలతో వరుసగా ఓటీటీలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh). ఈ ఏడాది ‘ఎఫ్ 3’ (F3) చిత్రంతో అభిమానులకు వేసవి వినోదాన్ని అందించారు.

Victory Venktesh కు జాతిరత్నం దొరికాడా?

గతేడాది ‘నారప్ప (Narappa), దృశ్యం 2 (Drishyam 2)’ చిత్రాలతో వరుసగా ఓటీటీలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh). ఈ ఏడాది ‘ఎఫ్ 3’ (F3) చిత్రంతో అభిమానులకు వేసవి వినోదాన్ని అందించారు.  తదుపరిగా వెంకీ ఏ సినిమా చేయబోతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.  అబ్బాయ్ రానా (Rana) తో కలిసి ‘రానా నాయుడు’ (Rananaidu) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ ఇద్దరికీ ఇదే మొదటి డిజిటల్ ఎంట్రీ. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న ఈ సిరీస్ అతి త్వరలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.  మరో పక్క వెంకటేశ్ .. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చిత్రం ‘కభీ ఈద్ కభీ దీవాలి’ (Kabhi Eed Kabhi Deewali) లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ‘అనారి (Anadi), తక్‌థీర్ వాలా (Thakdheerwala)’ సినిమాల తర్వాత చాలా కాలానికి వెంకటేశ్ బాలీవుడ్ తెరపై కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.


ఇక వెంకీ టాలీవుడ్ చిత్రాల విషయానికొస్తే..  ఆయన తదుపరి సినిమా కోసం ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. వాటిలో ఏ ఒక్కటీ కన్ఫర్మ్ కాలేదు. తాజాగా ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) దర్శకుడు అనుదీప్ కెవీ (Anudeep KV) పేరు వార్తల్లో నిలుస్తోంది. ‘పిట్టగోడ’ (Pittagoda) చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనుదీప్.. ‘జాతిరత్నాలు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్‌ (Shivakarthikeyan) తో ‘ప్రిన్స్’ (Prince) అనే మూవీని తెరకెక్కి్స్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత అనుదీప్ వెంకటేశ్ తో జతకట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతోందట. కామెడీ చిత్రాలకు చిరునామాగా నిలుస్తో్న్న అనుదీప్, కామెడీ టైమింగ్ లో తిరుగులేని వెంకీ.. ఇద్దరూ కలిస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించొచ్చు. 


అనుదీప్ చెప్పిన లైన్ వెంకీ (Venky) కి బాగా నచ్చి దాన్ని పూర్తి స్థాయిలో డవలప్ చేయమని వెంకీ చెప్పాడట. ప్రస్తుతం అనుదీప్ అండ్ టీమ్ స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నట్టు టాక్. ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల చేసిన తర్వాత వెంకటేశ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారట. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే వెంకీకి ఇప్పుడు జాతిరత్నం లాంటి దర్శకుడు దొరికాడని చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-06-29T18:33:16+05:30 IST