‘టైగర్‌’ కోసం మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ..

ABN , First Publish Date - 2022-04-01T17:36:13+05:30 IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియన్ మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించబోతుండగా, నటీ నటులు సహా ఇతర సాంకేతిక వర్గాన్ని మేకర్స్ ఫైనల్ చేసుకుంటున్నారు.

‘టైగర్‌’ కోసం మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ..

మాస్ మహారాజ రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియన్ మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించబోతుండగా, నటీ నటులు సహా ఇతర సాంకేతిక వర్గాన్ని మేకర్స్ ఫైనల్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రవితేజ సరసన బాలీవుడ్‌ భామ నూపూర్‌ సనన్‌ని ఎంపికచేసుకొన్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, రవితేజ ఇటీవల ఖిలాడి చిత్రంతో వచ్చి ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. త్వరలో రామారావు ఆన్‌డ్యూటీ సినిమాతో రాబోతున్నాడు. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ధమాకా, రావణాసుర షూటింగ్ జరుగుతున్నాయి. మెగా 154లో కూడా మాస్ రాజా కనిపించబోతున్నాడు.  

Updated Date - 2022-04-01T17:36:13+05:30 IST