Amitabh bachchan: బిగ్బీ మెట్రోలో సందడి.. సరదా ముచ్చట్లు!
ABN , First Publish Date - 2022-06-30T18:59:00+05:30 IST
బిగ్బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు. షూటింగ్లో భాగంగా ఆయన తాజాగా రాయదుర్గం మెట్రో స్టేషన్లో దర్శనమిచ్చారు. ట్రైన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం ఆయన అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.
బిగ్బీ అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు. షూటింగ్లో భాగంగా ఆయన తాజాగా రాయదుర్గం మెట్రో స్టేషన్లో దర్శనమిచ్చారు. ట్రైన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం ఆయన అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. (Project k shoot)
అలాగే వైజయంతీ మూవీస్ (Vyjayanti movies) నూతన కార్యాలయాన్ని అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వేడుకలో రాఘవేంద్రరావు, ప్రశాంత్నీల్, నాని, దుల్కర్ సల్మాన్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను నాని, వీడియోను వైజయంతి మూవీస్ సంస్థ.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరితో బిగ్బీ సరదాగా ముచ్చటించినట్లుగా ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.