త్వరలో పెళ్ళిపీటలెక్కనున్న సుప్రీమ్ హీరో?

ABN , First Publish Date - 2021-10-17T15:51:10+05:30 IST

గతనెల్లో బైక్ యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని సరిగ్గా అతడి పుట్టినరోజున డిస్చార్జ్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ సాయిధరమ్ కి విషెస్ తెలిపారు. త్వరలోనే సాయి తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి సాయిధరమ్ తేజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

త్వరలో పెళ్ళిపీటలెక్కనున్న సుప్రీమ్ హీరో?

గతనెల్లో బైక్ యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని సరిగ్గా అతడి పుట్టినరోజున డిస్చార్జ్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ సాయిధరమ్ కి విషెస్ తెలిపారు. త్వరలోనే సాయి తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి సాయిధరమ్ తేజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది కూడా అతడి పెళ్ళిగురించి. మొన్నామధ్య ఇప్పుడప్పుడే తాను పెళ్ళి చేసుకోవట్లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు సాయిధరమ్. ఇప్పుడు మళ్ళీ ఆయన పెళ్ళి ప్రసక్తిని అల్లు శిరీషే లేవనెత్తడం విశేషంగా మారింది. 



సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నీహారిక సాయికి విషెస్ చెబుతూ పోస్ట్ చేసిన వీడియోకి.. ‘ఇది నువ్వు సింగిల్ గా జరుపుకొనే చివరి బర్త్ డే అని నేను నిజంగా  నమ్ముతున్నాను. త్వరలోనే నువ్వు పెళ్లివార్త చబుతావని ఆశిస్తున్నాను’.. అంటూ   అల్లు శిరీష్  పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది. దీంతో సాయిధరమ్ త్వరలోనే తన సోలో బ్రతుకుకు ఎండ్ కార్డ్ వేసేస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇటీవల ‘రిపబ్లిక్’ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం తన కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు. మరి ఆయన పెళ్ళి వార్తల్లోని నిజానిజాలేంటో చూడాలి. 



Updated Date - 2021-10-17T15:51:10+05:30 IST