బ‌న్నీ.. బాలీవుడ్‌లో గెస్ట్ ఎంట్రీ ఇస్తాడా?

ABN , First Publish Date - 2021-07-18T15:57:45+05:30 IST

‘పుష్ప’ వంటి పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల్లు అర్జున్ ప‌ల‌క‌రించనున్నాడ‌నేది అందరికీ విదితమే. అయితే ఈ సినిమాతో పాటు మ‌రో బాలీవుడ్ సినిమాలో

బ‌న్నీ.. బాలీవుడ్‌లో గెస్ట్ ఎంట్రీ ఇస్తాడా?

‘పుష్ప’ వంటి పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల్లు అర్జున్ ప‌ల‌క‌రించనున్నాడ‌నేది అందరికీ విదితమే. అయితే ఈ సినిమాతో పాటు మ‌రో బాలీవుడ్ సినిమాలో అల్లు అర్జున్ న‌టించ‌బోతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే, బన్నీ, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి ‘షెహ‌జాద’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కార్తీక్ ఆర్య‌న్‌, కృతిస‌న‌న్ హీరో హీరోయిన్స్‌గా న‌టించ‌నున్నారు. ఈ బాలీవుడ్ రీమేక్‌లో అల్లు అర్జున్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌బోతున్నాడ‌ని టాక్. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఏక్తాక‌పూర్‌, అల్లు అర‌వింద్ ఈ రీమేక్‌లో నిర్మించ‌నున్నారు. మరి బన్నీ బాలీవుడ్ గెస్ట్ ఎంట్రీ గురించి నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

Updated Date - 2021-07-18T15:57:45+05:30 IST