బుల్లితెర వ్యాఖ్యాతగా బన్నీ?
ABN , First Publish Date - 2022-01-21T23:26:47+05:30 IST
టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది బుల్లితెర వ్యాఖ్యాతలుగా అలరించారు. కొంతమంది హీరోలుగా కొనసాగుతూనే వ్యాఖ్యాతలుగా కూడా టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని బుల్లితెరపై సందడి చేసినవారే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఆహా ఓటీటీ కోసం ‘అన్స్టాపబుల్’ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేటగిరీలో అల్లు అర్జున్ కూడా చేరబోతున్నారనీ తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది బుల్లితెర వ్యాఖ్యాతలుగా అలరించారు. కొంతమంది హీరోలుగా కొనసాగుతూనే వ్యాఖ్యాతలుగా కూడా టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని బుల్లితెరపై సందడి చేసినవారే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఆహా ఓటీటీ కోసం ‘అన్స్టాపబుల్’ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేటగిరీలో అల్లు అర్జున్ కూడా చేరబోతున్నారనీ తెలుస్తోంది. ‘ఆహా’ ఓటీటీ కోసం బన్నీ ఓ షో చేయనున్నారని కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే!
‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ తన గుర్తింపు రెట్టింపు చేసుకోవడానికే ఓటీటీ షో చేయనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ షో కేవలం టాలీవుడ్ సెలబ్రిటీల కోసమే కాదని, ఇతర పరిశ్రమల ఆర్టిస్ట్లు, సాంకేతిక నిపుణులు కూడా ఈ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఆహాలో ‘సామ్జామ్’, ‘అన్స్టాపబుల్’ షోలు విజయవంతంగా నడుస్తున్నాయి. అల్లు అర్జున్ ఓటీటీ షో చేసే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.