‘రాధేశ్యామ్’ దర్శకుడితో ఐకాన్ స్టార్?

ABN , First Publish Date - 2021-11-28T20:15:28+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఏ సినిమాలో నటిస్తున్నారు అనే విషయంలో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. నిజానికి పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చిత్రంలో నటిస్తారు అనే వార్తలు నిన్న మొన్నటి వరకూ వినిపించాయి.

‘రాధేశ్యామ్’ దర్శకుడితో ఐకాన్ స్టార్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఏ సినిమాలో నటిస్తున్నారు అనే విషయంలో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. నిజానికి పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చిత్రంలో నటిస్తారు అనే వార్తలు నిన్న మొన్నటి వరకూ వినిపించాయి. కానీ ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. అలాగే.. బోయపాటి దర్శకత్వంలో బన్నీ చిత్రం ‘పుష్ప’ తర్వాతే మొదలు కాబోతోందని టాక్స్ కూడా వినిపించాయి. 


ఫైనల్ గా ఇప్పుడో సరికొత్త రూమర్ పుట్టుకొచ్చింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆయన బన్నీకి ఓ స్టోరీ లైన్ చెప్పారట. దానికి ఇంప్రెస్ అయిన బన్నీ స్ర్కిప్ట్ ను వెంటనే సమకూర్చమని రాధాకృష్ణకి చెప్పారట. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రాధాకృష్ణ కుమార్ చేయబోయే సినిమా బన్నీతోనేనట. అలాగే.. పరశురామ్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2021-11-28T20:15:28+05:30 IST