allu arjun: మరో సరికొత్త ఫీట్..తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-01-29T16:29:51+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సరికొత్త ఫీట్‌ను సాధించడంతో ఆయన అభిమానులు..తగ్గేదే లే అంటున్నారు. గత నెల 'పుష్ప:ది రైజ్ పార్ట్ 1' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ దేశవ్యాప్తంగా ఎంతమంది నుంచి ప్రశంసలు అందుకున్నారో తెలిసిందే.

allu arjun: మరో సరికొత్త ఫీట్..తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సరికొత్త ఫీట్‌ను సాధించడంతో ఆయన అభిమానులు..తగ్గేదే లే అంటున్నారు. గత నెల 'పుష్ప:ది రైజ్ పార్ట్ 1' తో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ దేశవ్యాప్తంగా ఎంతమంది నుంచి ప్రశంసలు అందుకున్నారో తెలిసిందే. ఈ సినిమా ప్రభావం బన్నీ మీద బాగా పడింది. దాంతో ఆయనకు సోషల్ మీడియాలో మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నందుకు అల్లు అర్జున్ ఓ ఫొటోను షేర్ చేసి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 


అది జరిగిన కేవలం పది రోజుల్లోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య మరోసారి భారీగా పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం ఈ 10 రోజుల్లోనే అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య 1 మిలియన్ దాటేసింది. దీంతో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ లో అల్లు అర్జున్‌కు 16 మిలియన్ల మంది ఫాలోవర్స్ అయ్యారు. త్వరలోనే ఈ సంఖ్య 20 మిలియన్ల మార్క్‌ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే, ఆయన అభిమానులు అసలు తగ్గేదే లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పుష్ప సీక్వెల్ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు రాబోతోంది. సుకుమా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నారు. 



Updated Date - 2022-01-29T16:29:51+05:30 IST