Akshay Kumar Movie Official Teaser: సమయం లేదు మిత్రమా.. రామసేతుని కాపాడాలి..

ABN , First Publish Date - 2022-09-26T19:34:03+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) రూటే సేపరేటు. సాధారణంగా స్టార్స్ హీరోలు అంతా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ..

Akshay Kumar Movie Official Teaser: సమయం లేదు మిత్రమా.. రామసేతుని కాపాడాలి..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) రూటే సేపరేటు. సాధారణంగా స్టార్స్ హీరోలు అంతా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ.. ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు. కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం అలా కాదు. ఒకే ఏడాది కనీసం 5 నుంచి 6 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తుంటాడు. ఈ ఏడాది సైతం ఇప్పటికే.. బచ్చన్ పాండే, సామ్రాట్ ఫృథ్వీరాజ్, రక్షాబంధన్, కట్‌పుట్లీలతో ప్రేక్షకులని పలకరించాడు. అయితే.. ఈ నాలుగు సినిమాల్లో మొదటి మూడు సినిమాలు థియేటర్స్‌లో విడుదలై ఫ్లాపులుగా మిగిలాయి. కాగా.. తమిళ చిత్రం ‘రాచ్చసన్‌(తెలుగులో రాక్షసుడు)’కి రిమేక్‌గా తెరకెక్కిన ‘కట్‌పుట్లీ’ మాత్రం డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై.. మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.


ఈ తరుణంలోనే ఆయన మరో చిత్రంతో ప్రేక్షకులకి ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఆ మూవీ పేరు ‘రామ సేతు(Ram Setu)’. రామాయణంలో లంకలో ఉన్న సీతని తీసుకురావడానికి వానర సైన్యం సహాయంతో రాముడు నిర్మించి రామసేతు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో అక్షయ్ పురాతత్వ శాస్త్రవేత్తగా నటించాడు. కొన్ని దుష్ట శక్తులు భారతదేశం వారసత్వంగా భావిస్తున్న రామసేతుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దీంతో నాస్తికుడైన ఓ పురాతత్వ శాస్త్రవేత్త రామసేతుని కాపాడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్రం. ఈ చిత్ర టీజర్‌ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.




‘రామసేతుని కాపాడటానికి మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ టీజర్‌లో యాక్షన్ అండ్వెంచర్‌గా మలుపులతో ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంది. కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా తెరకెక్కిన్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా ఈ మూవీని దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల చేయనున్నట్లు.. ఆ టీజర్‌లో మూవీ టీం ప్రకటించింది. దీంతో ఈ మూవీపై ఇప్పటి వరకూ ఉన్న అంచనాలు ఇంకా పెరిగాయి. దీంతో మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని, టీజర్ చాలా బావుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), టాలీవుడ్ యువ నటుడు సత్య దేవ్ కీలకపాత్రల్లో నటించారు.



Updated Date - 2022-09-26T19:34:03+05:30 IST