దీపావళి తర్వాత నన్నెవరూ ఆపలేరు..: Akshay Kumar

ABN , First Publish Date - 2021-09-26T03:30:44+05:30 IST

కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపైనా పడింది. సినిమా రంగం కూడా చాలా ఎఫెక్ట్ అయింది. అయితే మన టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ థియేటర్లు వెలవెలబోతున్నాయి. కరోనా దెబ్బకు

దీపావళి తర్వాత నన్నెవరూ ఆపలేరు..: Akshay Kumar

కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపైనా పడింది. సినిమా రంగం కూడా చాలా ఎఫెక్ట్ అయింది. అయితే మన టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ థియేటర్లు వెలవెలబోతున్నాయి. కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడి.. చాలా నష్టపోయారు. మన టాలీవుడ్ కాస్త తేరుకుని పరుగులుపెడుతోంది. ఫస్ట్ లాక్డౌన్ అనంతరం కూడా మంచి హిట్లు పడ్డాయి. సెకండ్ లాక్డౌన్ అనంతరం థియేటర్లు బాగా నడుస్తున్నాయి. 


మరోవైపు అటు కోలీవుడ్‌లో ఇటీవల పరిస్థితి కొంచెం మెరుగుపడింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఇంకా థియేటర్లను ఓపెన్ చేయనే లేదు. ఈ అంశంపై బాలీవుడ్ పెద్దలు ఇటీవల.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలపై మహారాష్ట్ర సర్కార్  సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 22 తరువాత థియేటర్లు ప్రారంభం చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో దీపావళి, క్రిస్మస్ సందర్భంగా చిత్రాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. 


ఈ క్రమంలో అక్షయ్ కుమార్ చిత్రం ముందుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న సూర్యవంశీ చిత్రం.. విడుదల కోసమే ఎదురు చూస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. దీపావళికి విడుదలవుతున్నట్లు ప్రకటించారు. దీనిపై అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్నామని, తర్వాత తమను ఎవరూ ఆపలేరని చెప్పారు. మరోవైపు ఈ చిత్రం కోసం అక్షయ్ అభిమానులు .. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-09-26T03:30:44+05:30 IST