వదంతులను వార్తలుగా మలచొద్దు! - నాగార్జున విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-01-28T04:57:46+05:30 IST

‘‘నాగచైతన్య - సమంత విడాకుల విషయంలో నేను మాట్లాడినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. వదంతుల్ని వార్తలుగా మలచొద్దని మీడియాకు విన్నపం’...

వదంతులను వార్తలుగా మలచొద్దు! - నాగార్జున విజ్ఞప్తి

‘‘నాగచైతన్య - సమంత విడాకుల విషయంలో నేను మాట్లాడినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం.  వదంతుల్ని వార్తలుగా మలచొద్దని మీడియాకు విన్నపం’’ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. చైతన్యతో సమంత విడాకుల వ్యవహారంపై నాగార్జున స్పందించినట్టు, సమంత అడిగితేనే చైతన్య విడాకులు ఇచ్చినట్టు, ఈ విషయంలో చై చాలా బాధపడినట్టు ఓ వార్త గురువారం అంతా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై నాగ్‌ స్పందించాల్సివచ్చింది. ‘‘సామాజిక మాధ్యమాల్లో నా పేరుతో వస్తున్న కామెంట్స్‌లో నిజం లేద’’ంటూ నాగ్‌ ట్వీట్‌ చేశారు. దాంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. ‘‘ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం’’ అంటూ గతంలోనే నాగచైతన్య క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-01-28T04:57:46+05:30 IST