నాగార్జున 'ఘోస్ట్'లో అఖిల్ గెస్ట్ రోల్..?
ABN , First Publish Date - 2021-10-21T14:34:34+05:30 IST
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఘోస్ట్'. ఇందులో ఆయన తనయుడు అఖిల్ అక్కినేని ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఘోస్ట్'. ఇందులో ఆయన తనయుడు అఖిల్ అక్కినేని ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాగార్జున లుక్ రిలీజై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో అఖిల్ కూడా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే దర్శకుడు ప్రవీణ్ సత్తారు అఖిల్ను ఎలాంటి పాత్రలో చూపిస్తున్నాడో అనే ఆసక్తి అక్కినేని అభిమానుల్లో విపరీతంగా పెరుగుతుంది. ఇక ఇటీవలే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీతో వచ్చిన ఈ యంగ్ హీరో మంచి హిట్ అందుకున్నాడు. సూపర్ హిట్ టాక్తో ఎంజాయ్ చేస్తున్న అఖిల్ త్వరలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న 'ఏజెంట్' మూవీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు.