ఓటీటీలో వచ్చేసిన అఖండ, 'శ్యామ్ సింగ రాయ్'

ABN , First Publish Date - 2022-01-21T13:01:01+05:30 IST

గత ఏడాది డిసెంబర్‌లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న 'అఖండ', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాయి. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి

ఓటీటీలో వచ్చేసిన అఖండ, 'శ్యామ్ సింగ రాయ్'

గత ఏడాది డిసెంబర్‌లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న 'అఖండ', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాయి. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'శ్యామ్ సింగ రాయ్' గత నెల 24న తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో థియేట్రికల్ రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా నిన్న (జనవరి 20 గురువారం) అర్థరాత్రి 12 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


ఇక బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' చిత్రం కూడా గత నెలలోనే రిలీజై భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. 100కు పైగా థియేటర్స్‌లో ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. కాగా, ఈ సినిమా ఈరోజు (జనవరి 21 శుక్రవారం) నుంచి సాయంత్రం 6 గంటలకు డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజై భారీ హిట్ సాధించిన 'అఖండ', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. 

Updated Date - 2022-01-21T13:01:01+05:30 IST